మాస్క్ మాల‌లతో మంత్రికి స్వాగ‌తం.... శానిటైజ‌ర్ల పంపిణీ!

ABN , First Publish Date - 2020-07-11T16:48:05+05:30 IST

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజెపీ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి ప్రద్యుమాన్ సింగ్ తోమర్ తొలిసారిగా గ్వాలియ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అత‌నికి మాస్క్ మాల‌ల‌తో స్వాగతం...

మాస్క్ మాల‌లతో మంత్రికి స్వాగ‌తం.... శానిటైజ‌ర్ల పంపిణీ!

గ్వాలియ‌ర్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజెపీ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి ప్రద్యుమాన్ సింగ్ తోమర్ తొలిసారిగా గ్వాలియ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అత‌నికి మాస్క్ మాల‌ల‌తో స్వాగతం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మ‌ద్ద‌తుదారులు అక్క‌డికి వ‌చ్చిన ప్ర‌జ‌ల‌కు మాస్క్‌ల‌ను, శానిటైజ‌ర్ల‌ను పంపిణీ చేశారు. త‌రువాత మంత్రి  ప్రద్యుమాన్ సింగ్ దివంగత మాధవరావు సింధియా విగ్రహానికి పూల‌మాల వేశారు. అంతకుముందు గాంధీ సర్క్యూట్ రోడ్ హౌస్‌కు చేరుకుని సింధియా మద్దతుదారులను కలిశారు. ఈ సంద‌ర్భంగా స్థానికంగా ఉన్న కొంతమంది తల్లిదండ్రులు... విద్యార్థుల ఫీజుల విష‌యంలో ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న‌ ఒత్తిడిపై మంత్రికి ఫిర్యాదు చేశారు. ప్ర‌స్తుతం అంద‌రి ఆర్థిక ప‌రిస్థితులు కుదేల‌య్యాయ‌ని, ఇటువంటి  ప‌రిస్థితిలో త‌మ పిల్ల‌ల స్కూలు ఫీజుల క‌ట్ట‌లేమ‌ని మంత్రికి మొర‌పెట్టుకున్నారు. 


Updated Date - 2020-07-11T16:48:05+05:30 IST