నియంత్రిత సాగు అమలుపై అవగాహన సదస్సులు
ABN , First Publish Date - 2020-05-29T10:13:18+05:30 IST
నియంత్రిత సాగుపై రైతుల్లో అవగాహన పెంపునకు మంత్రి జగదీ్షరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి పర్యటన ఖరారు
నల్లగొండ రూరల్, మే 28 : నియంత్రిత సాగుపై రైతుల్లో అవగాహన పెంపునకు మంత్రి జగదీ్షరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించే రైతు అవగాహన సదస్సుల్లో ఈ నెల 30న సూర్యాపేట, నల్లగొండ జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఇదే జిల్లాలో 31న నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. జూన్1న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో పర్యటించి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు. జూన్ 3వ తేదీన నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, దేవరకొండ నియోజక వర్గాల్లో పర్యటించి జూన్ 4వ తేదీన భువనగిరి, సూర్యాపేట నియోజకవర్గాల్లో పాల్గొనున్నారు. సదస్సుల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులు హాజరయ్యే విధంగా ప్రణాళికలు చేపట్టారు.