మంత్రులదే శకునిపాత్ర

ABN , First Publish Date - 2021-10-14T05:01:49+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి క్యాబినెట్‌లోని మంత్రులే శకునిపాత్ర పోషిస్తున్నారని టీడీపీ జిల్లా పార్లమెం టరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ విమర్శించారు.

మంత్రులదే శకునిపాత్ర
మాట్లాడుతున్న రవికుమార్‌

టీడీపీ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ 

శ్రీకాకుళం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి క్యాబినెట్‌లోని మంత్రులే శకునిపాత్ర పోషిస్తున్నారని టీడీపీ జిల్లా పార్లమెం టరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ విమర్శించారు.  బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి సీదిరి అప్పలరాజుకు మహాభా రతంలోని శకుని పాత్రపై సరైన అవగాహన లేక తప్పుడు ప్రకటనలు చేస్తున్నారన్నారు. పాలించే వ్యక్తి పక్కనే ఉండి.. తప్పుడు మాటలు, సలహాలు ఇచ్చే శకుని పాత్రను క్యాబినెట్‌ మంత్రులు, సలహాదారులే నిర్వహిస్తున్నా రన్నారు. పాలన చేతకాక, అవినీతిని నియంత్రించలేక, దుబారాను తగ్గించలేక, అసమర్థ చేష్టలతో అయోమయంలో వైసీపీ పాలకులు ఉన్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును శకునితో పోల్చడం మంత్రి అప్పలరాజు అవగాహనరాహిత్యానికి నిదర్శనమన్నారు. తప్పుడు ఆలోచనలు, పనులతో ప్రజల నెత్తిన శఠగోపం పెట్టిన ఘనత వైసీపీ నేతలకే దక్కిందన్నారు.  




Updated Date - 2021-10-14T05:01:49+05:30 IST