మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం
ABN , First Publish Date - 2021-09-18T05:51:54+05:30 IST
ప్రధానమంత్రి మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమవుతున్నదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు
అనకాపల్లి టౌన్, సెప్టెంబరు 17: ప్రధానమంత్రి మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమవుతున్నదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక కర్షక నిలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ గద్దెనెక్కిన తరువాత దేశంలో ప్రజలు 93 శాతం అప్పులపాలయ్యారన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒక బేరల్ ముడిచమురు ధర 169 డాలర్లు ఉన్నప్పుడు దేశంలో పెట్రోల్ ధర లీటరు రూ.65 ఉండేదని, ప్రస్తుతం బేరల్ ధర 69 డాలర్లకు తగ్గినప్పటికీ పెట్రోల్ ధర రూ.108 పెరగడం విచారకరమని వాపోయారు. ఇందుకు నిరసనగా 27న చేపట్టే భారత్బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సమావేశంలో కౌలు రైతుల సంఘం ప్రతినిధులు పి.జములయ్య, ఎ.బాలకృష్ణ పాల్గొన్నారు.