ఆమె ఓ బిడ్డకు తల్లి.. భర్తను, కొడుకును వదిలేసి ఆమె పాకిస్థాన్ ఎందుకు వెళ్లాలనుకుందో తెలిస్తా షాక్!

ABN , First Publish Date - 2022-01-08T17:27:19+05:30 IST

ఆమె ఓ వివాహిత.. ఓ బిడ్డకు తల్లి కూడా.. ఆమె ఇటీవల తన భర్తను, బిడ్డను వదిలేసి ఇంటి నుంచి అదృశ్యమైంది..

ఆమె ఓ బిడ్డకు తల్లి.. భర్తను, కొడుకును వదిలేసి ఆమె పాకిస్థాన్ ఎందుకు వెళ్లాలనుకుందో తెలిస్తా షాక్!

ఆమె ఓ వివాహిత.. ఓ బిడ్డకు తల్లి కూడా.. ఆమె ఇటీవల తన భర్తను, బిడ్డను వదిలేసి ఇంటి నుంచి అదృశ్యమైంది.. సరిహద్దు దాటి పాకిస్థాన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు దొరికిపోయింది.. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.. విచారణలో ఆమె చెప్పింది విని షాకయ్యారు.. పాక్‌లోని ఓ యువకుడితో తాను ప్రేమలో పడ్డానని, అతడితో కలిసి జీవించేందుకే అక్కడకు వెళుతున్నానని ఆమె విచారణలో చెప్పింది. 


రాజస్థాన్‌లోని ధోలాపూర్‌కు చెందిన వివాహితకు ఆరు నెలల క్రితం లూడో ఆడుతుండగా పాకిస్థాన్‌కు చెందిన అలీ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ నెంబర్లు మార్చుకుని వాట్సాప్ ద్వారా ఛాట్ చేసుకునేవారు. ఈ క్రమంలో ప్రేమలో పడ్డారు. ఓ బిడ్డకు తల్లి కూడా అయిన మహిళ పాకిస్థాన్ వెళ్లిపోవాలనుకుంది. అత్తారి బోర్డర్ దగ్గరకు రమ్మని ఆ మహిళకు అలీ చెప్పాడు. దీంతో ఆ మహిళ తన బిడ్డను కూడా వదిలేసి పంజాబ్ వెళ్లిపోయింది. అత్తారి బోర్డర్ వద్దకు వెళ్లేందుకు బుధవారం మధ్యాహ్నం ఆమె జీప్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. 


ఆ సమయంలో అమృత్‌సర్ పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ఆమె చెబుతున్న సమాధానాలు అనుమానాస్పదంగా ఉండడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. విచారణలో ఆమె మొత్తం కథ చెప్పింది. అంతేకాదు తనను ఎలాగైనా తన ప్రియుడితో కలపాలని వేడుకుంది. అయితే పోలీసులు ధోలాపూర్‌లో ఉన్న ఆమె భర్తకు సమాచారం అందించారు.  

Updated Date - 2022-01-08T17:27:19+05:30 IST