కుమారుడికి తలకొరివి పెట్టిన తల్లి
ABN , First Publish Date - 2021-04-19T04:53:39+05:30 IST
కుమారుడికి ఓ తల్లి తలకొరివి పెట్టిన సంఘటన ఇచ్ఛాపురం మండలంలోని డొంకూరులో ఆదివారం చోటుచేసుకుంది.
ఇచ్ఛాపురం రూరల్, ఏప్రిల్ 18: కుమారుడికి ఓ తల్లి తలకొరివి పెట్టిన సంఘటన ఇచ్ఛాపురం మండలంలోని డొంకూరులో ఆదివారం చోటుచేసుకుంది. డొంకూరులో సూరాడ సురేష్ (30) ఆదివారం ఉదయం గుండె సంబంధిత వ్యాధితో మృతిచెందాడు. దీంతో తోబు ట్టువులు ఎవరూ లేకపోవడంతో తల్లి మహాలక్ష్మి తలకొరివి పెట్టాల్సి వచ్చింది. సురేష్కు భార్య నాగవేణి, ఏడాది కుమారుడు ఉన్నాడు.