న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలి
ABN , First Publish Date - 2021-03-02T05:06:53+05:30 IST
హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసును ప్రభుత్వం తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని సిర్పూర్(టి) బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిశోర్కుమార్ అన్నారు.
సిర్పూర్(టి) బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిశోర్కుమార్
సిర్పూర్(టి), మార్చి1: హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసును ప్రభుత్వం తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని సిర్పూర్(టి) బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిశోర్కుమార్ అన్నారు. సోమవారం కోర్టు ఆవరణలో ఆయన మాట్లాడుతూ వామన్రావు హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ దీక్షల్లో న్యాయవాదులు రైయిస్ అహ్మద్, శంకర్రావు, గణపతి, దయారాజ్సింగ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.