యువకుడి హత్య
ABN , First Publish Date - 2021-06-23T07:42:45+05:30 IST
మండలంలోని కిష్టాపురం గ్రామ శివారులో ఓ యువకుడిని హత్య చేశారు.
మిర్యాలగూడ రూరల్, జూన్ 22: మండలంలోని కిష్టాపురం గ్రామ శివారులో ఓ యువకుడిని హత్య చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన యువకుడు కొండ్రపోల్ గ్రామానికి చెందిన బొమ్మకంటి నాగయ్య(37)గా పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఎమ్మెల్యే భాస్కర్ రావు ఘటనస్థలానికి చేరుకుని నాగయ్య మృతదేహాన్ని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.