మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
ABN , First Publish Date - 2021-01-18T05:03:30+05:30 IST
బ్రమరాంభ మల్లిఖార్జునస్వామి ఆలయానికి ఆదివారం వివిధ మండలాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
ఓదెల, జనవరి 17: బ్రమరాంభ మల్లిఖార్జునస్వామి ఆలయానికి ఆదివారం వివిధ మండలాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. వ్యవసాయ పనులు పూర్తి చేసుకున్న వారంతా పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల నుంచి కుటుంబాల వారిగా తరలివచ్చి అర్చనలు నిర్వహించారు. అలాగే గోదా వరిఖనికి చెందిన భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి కోడెల మొక్కులను తీర్చు కొని మల్లన్నకు పట్నాలు వేసి బోనాలు సమర్పించారు.