ఓసీ మహాగర్జనను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-01-21T05:42:58+05:30 IST
అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం చేసిన ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయాలని ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ భాస్కర్రెడ్డి డిమాండ్ చేశారు.
మిరుదొడ్డి, జనవరి 20 : అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం చేసిన ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయాలని ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ భాస్కర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మిరుదొడ్డి మహంకాళీ ఆలయంలో 29న హైదరాబాద్లో నిర్వహించే ఓసీ మహాగర్జనను విజయవంతం చేయాలంటూ వాల్పోస్టర్లను విడుదల చేశారు. అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, నరేందర్రెడ్డి, రాంరెడ్డి, సదానందరెడ్డి పాల్గొన్నారు.