చెరువులో పడి వృద్ధురాలు మృతి

ABN , First Publish Date - 2021-05-08T06:07:25+05:30 IST

మండలంలోని అనాజీపూర్‌ గ్రామంలోని చెరువులో పడి ఓ వృద్ధురాలు మృతి చెందింది.

చెరువులో పడి వృద్ధురాలు మృతి

రాయపోల్‌, మే 7: మండలంలోని అనాజీపూర్‌ గ్రామంలోని చెరువులో పడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. శుక్రవారం కుటుంబ సభ్యులు, ఎస్‌ఐ మహబూబ్‌ తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన బుడ్డమళ్ల శివమ్మ (70) తాను ఉండేందుకు ఓ గది నిర్మించి ఇవ్వాల్సిందిగా గురువారం కొడుకులను కోరింది. కొన్ని రోజుల తర్వాత గది నిర్మించి ఇస్తామని కొడుకులు సర్దిచెప్పారు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె గురువారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. శుక్రవారం ఉదయం చెరువులో మహిళ మృతదేహం తేలిందని స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లి చూసి శివమ్మ మృతదేహాన్ని గుర్తుపట్టారు. మృతురాలి మనవరాలు రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-08T06:07:25+05:30 IST