23న వన్ ప్లస్ స్మార్ట్ వాచ్ రిలీజ్
ABN , First Publish Date - 2021-03-20T05:55:50+05:30 IST
‘వన్ ప్లస్’ తొలిసారిగా స్మార్ట్ వాచ్ని 2021 మార్చి 23న విడుదల చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ‘వన్ ప్లస్’ 9 సిరీస్తో కలిపి రిలీజ్ చేయనుంది
‘వన్ ప్లస్’ తొలిసారిగా స్మార్ట్ వాచ్ని 2021 మార్చి 23న విడుదల చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ‘వన్ ప్లస్’ 9 సిరీస్తో కలిపి రిలీజ్ చేయనుంది. ‘వన్ ప్లస్’ బాండ్తో ఈ ఏడాది ఆరంభంలోనే స్మార్ట్ వేరబుల్స్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. బాండ్ రేటు రూ.2,499. హార్ట్బీట్ తదితరాలతో ఇప్పుడు మార్కెట్లో ఉన్న స్మార్ట్వాచ్ ఫోన్లతో పోల్చుకుంటే తమ దానితో డిజిటల్ అనుభవం ఎక్కువ స్థాయిలో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. రేటు ప్రకటించనప్పటికీ, వినియోగదారులకు అనుకూలంగానే ఉంటుందని తెలిపింది. అలాగే సరికొత్త ఫీచర్లతో రెండు స్మార్ట్ ఫోన్లను ‘వన్ ప్లస్ 9’, ‘వన్ ప్లస్ 9ప్రొ’ పేరిట అదే రోజు విడుదల చేస్తోంది. సోనీ మేక్స్ సెన్సర్, మెరుగుపర్చిన అల్ర్టావైడ్ కెమెరాతో ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి.