ఆన్‌లైన్‌ టికెట్ల విధానం అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-06-07T06:52:57+05:30 IST

సినిమా థియేటర్లలో ఆన్‌లైన్‌ టికెట్ల విధానాన్ని అమలు చేయాలని చిత్తూరు ఆర్డీవో రేణుక తెలిపారు.

ఆన్‌లైన్‌ టికెట్ల విధానం అమలు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న చిత్తూరు ఆర్డీవో రేణుక

చిత్తూరు రూరల్‌, జూన్‌ 6: సినిమా థియేటర్లలో ఆన్‌లైన్‌ టికెట్ల విధానాన్ని అమలు చేయాలని చిత్తూరు ఆర్డీవో రేణుక తెలిపారు. సోమవారం మధ్యాహ్నం చిత్తూరు డివిజన్‌ పరిధిలోని సినిమా థియేటర్ల యజమానులతో ఆమె సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనే టికెట్లు విక్రయించాలని జీవో 69ని విడుదల చేసిందన్నారు. ప్రభుత్వ ఆదేశాలు, జీవో విధి విధానాలను పాటిస్తామని అంగీకరిస్తూ థియేటర్‌ యజమానుల వద్ద అంగీకార పత్రం తీసుకున్నారు. రూల్స్‌ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - 2022-06-07T06:52:57+05:30 IST