సంస్థ అభివృద్ధికి కృషి చేయాలి
ABN , First Publish Date - 2022-01-25T05:52:22+05:30 IST
ఆర్టీసీ డ్రైవర్లు సంస్థను అభివృద్ధిలోకి తీసుకరావా లని మహబూబ్నగర్ డి.వి.యం మాధవరావు పేర్కొన్నారు.
- ఆర్టీసీ డ్రైవర్ల అభినందన సభలో అధికారులు
మహబూబ్నగర్ టౌన్, జనవరి 24 : ఆర్టీసీ డ్రైవర్లు సంస్థను అభివృద్ధిలోకి తీసుకరావా లని మహబూబ్నగర్ డి.వి.యం మాధవరావు పేర్కొన్నారు. సోమవారం స్థానిక డిపోలో ఆర్టీసీ డ్రైవర్ల అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డి.వి.యంతోపాటు సీఐ అశోక్, యం.వి.ఐ నరేష్ పాల్గొని ఆర్టీసీ డ్రైవర్లను అభినందించారు. ప్రతీ సంవత్సరం జనవరి 24వ తేదీన డ్రైవర్ల అభినందన సభ నిర్వహిస్తారని తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధిలో డ్రైవర్లు, కండక్టర్ల పాత్ర ఎంతో ఉంటుందని అన్నారు. డ్రైవర్ వృత్తి బాధ్యతతో కూడుకు న్నదని అన్నారు. కుటుంబ సభ్యులను ఎలా రక్షిస్తారో ప్రయాణికులను కూడా ఆ విధంగా రక్షించి గమ్యస్థానాలకు తీసుకవెళ్తారని అన్నారు. ప్రతీ డ్రైవర్కు డ్రైవర్ దినోత్సవ శుభాకాం క్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ అశోక్రాజు, ఉద్యోగులు, డ్రైవర్లు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.