పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలి
ABN , First Publish Date - 2021-06-24T04:52:03+05:30 IST
భారత కమ్యూనిస్టు పార్టీ పూర్వ వైభవానికి ప్రతీ కార్యకర్త సైనుకుడిలా కృషి చేయాలని జిల్లా కార్యదర్శి మంద పవన్ పిలుపునిచ్చారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి పవన్
కోహెడ, జూన్ 23: భారత కమ్యూనిస్టు పార్టీ పూర్వ వైభవానికి ప్రతీ కార్యకర్త సైనుకుడిలా కృషి చేయాలని జిల్లా కార్యదర్శి మంద పవన్ పిలుపునిచ్చారు. బుధవారం కూరెళ్ల, గొట్లమిట్ట గ్రామాల్లో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు చేయాలన్నారు. పార్టీ నిర్మాణ అభివృద్ధికి ప్రతీ కార్యకర్త కంకణబద్ధులై ఉండాలన్నారు. అనంతరం కొంతమంది యువకులు ఆయన సమక్షంలో సీపీఐలో చేరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వేల్పుల బాలమల్లు, కనుకుట్ల శంకర్, మండల సహాయ కార్యదర్శి బోనగిరి శంకర్, మంద సురేష్, గోపి, మాజీ సర్పంచ్ ఎల్లయ్య, లక్ష్మణ్, బాల్రెడ్డి, రాజశేఖర్, లింగయ్య, రాజశేఖర్, రాజయ్య, అంతయ్య పాల్గొన్నారు.