అత్యాచారం చేసిన నిందితులను శిక్షించాలి

ABN , First Publish Date - 2022-06-06T05:37:33+05:30 IST

హైదరాబాద్‌లోని అమ్నేషియా పబ్‌లో బాలికపై అత్యా చార ఘటనకు పాల్పడిన నిందితుల్ని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మహంకాళి స్వామి డిమాండ్‌ చేశారు.

అత్యాచారం చేసిన నిందితులను శిక్షించాలి
ఖని చౌరస్తాలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు

- గోదావరిఖనిలో ఎన్‌ఎస్‌యూఐ నిరసన 

కోల్‌సిటీటౌన్‌, జూన్‌ 5: హైదరాబాద్‌లోని అమ్నేషియా పబ్‌లో బాలికపై అత్యా చార ఘటనకు పాల్పడిన నిందితుల్ని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మహంకాళి స్వామి డిమాండ్‌ చేశారు. ఆది వారం గోదావరిఖని ప్రధానచౌరస్తాలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా మహంకాళి స్వామి మాట్లాడుతూ మైనర్‌ బా లికపై జరిగిన సంఘటనలో హోం మినిస్టర్‌ మనవడు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడు కులు నిందితులని తెలిసినా ఇప్పటివరకు పోలీసు యంత్రాంగం అదుపులోకి తీసు కోలేదన్నారు. వారిని బయటపడేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. కాంగ్రెస్‌, దాని అనుబంధ సంఘాల నాయకులు దాసరి విజయ్‌, కాల్వ లింగస్వామి, ఎం.రవికుమార్‌, బొంతల రాజేష్‌, దొంతుల లింగం, దుర్గాప్రసాద్‌, ఉదయ్‌రాజ్‌, యుగేందర్‌, ముస్తాఫా, నగునూరి రాజు, సుతారి లక్ష్మణ్‌, గట్ల రమేష్‌, కొప్పుల శంకర్‌, ఓదెలుయాదవ్‌, రవియాదవ్‌, ఎండి.యాకూబ్‌, పవన్‌, సతీష్‌, మహేష్‌, తిరుపతియాదవ్‌, కిరణ్‌, ఎ.సత్యనారాయ ణ, మహిళా కాంగ్రెస్‌ నాయకులు స్వప్న, స్వరూప పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-06T05:37:33+05:30 IST