విద్యుత్ తీగలను పట్టుకుని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-11-21T13:32:33+05:30 IST

వరంగల్ పెట్రోల్ పంపు వద్ద గుర్తు తెలియని వ్యక్తి హై టెన్షన్ విద్యుత్ పోల్ ఎక్కి తీగలను పట్టుకొని..

విద్యుత్ తీగలను పట్టుకుని వ్యక్తి ఆత్మహత్య

వరంగల్ అర్బన్: జిల్లా ఖిలా వరంగల్ పెట్రోల్ పంపు వద్ద గుర్తు తెలియని వ్యక్తి హై టెన్షన్ విద్యుత్ పోల్ ఎక్కి తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు వద్దని వారించినా ఆ వ్యక్తి పట్టించుకోలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఆ వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి ఆత్మహత్యను స్థానికులు వీడియో తీశారు. సంఘటనా ప్రదేశానికి  చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2020-11-21T13:32:33+05:30 IST