వాతావరణం అనుకూలించక తిరిగొచ్చిన విమానం
ABN , First Publish Date - 2022-01-23T04:37:21+05:30 IST
పొగమంచు కార ణంగా వైజాగ్లో ల్యాండింగ్కు
శంషాబాద్రూరల్, జనవరి 22: పొగమంచు కార ణంగా వైజాగ్లో ల్యాండింగ్కు అనుమతి రాకపోవడంతో ఇండిగో విమానం వెనక్కి వచ్చేసింది. శంషాబాద్ నుంచి వెళ్లిన ఆ విమానం తిరిగి శంషాబాద్లోనే అత్యవసర ల్యాండింగ్ అయింది. శుక్రవారం ఉదయం 45 మంది ప్రయాణికులతో ఆ విమానం వైజాగ్ చేరింది. అక్కడ దట్టమైన పొగమంచు కారణంగా విమానాశ్రయంలో ల్యాండింగ్కు అనుమతి లభించలేదు. దీంతో విమానం పలుమార్లు గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. దాంతో ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేసినట్లు సమా చారం. చేసేదిలేక ఫైలెట్ శంషాబాద్ ఏటీసీ అధికా రులను సంప్రదించారు. వారు అనుమతి ఇవ్వడంతో శంషాబాద్లో సురక్షితంగా అత్యవసరల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ అధికారులపై ప్రయాణికులు మండిపడ్డారు.