మొక్కలను సంరక్షించుకోవాలి

ABN , First Publish Date - 2021-06-18T05:24:11+05:30 IST

మొక్కలను సంరక్షించుకోవాలి

మొక్కలను సంరక్షించుకోవాలి
కౌకుంట్ల పల్లెప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న డీపీవో శ్రీనివా్‌సరెడ్డి

  • రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివా్‌సరెడ్డి

చేవెళ్ల: ప్రభుత్వం చేపడుతున్న పల్లెప్రకృతి వనాల్లోని మొక్కలను సం రక్షించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. గురువారం చేవెళ్ల మండల పరిధిలోని కౌంకుట్ల గ్రామాన్ని ఆకస్మీకంగా తనీఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటిస్తు పల్లెప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వం చేపడుతున్న పల్లె ప్రకృతి వనం తోపాటు నర్సరీల్లో ఉన్న మొక్కలను బాగా పెంచాలన్నారు. గ్రామాల్లో విధులన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వర్షా కాలంలో ఎక్కడా మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. పంచాయతీ అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎల్పీవో శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీవో హరీశ్‌కుమార్‌, ఎంపీవో విఠలేశ్వర్‌, సర్పంచ్‌ గాయత్రి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T05:24:11+05:30 IST