హత్య కేసును ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2021-09-18T00:41:23+05:30 IST

జిల్లాలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల

హత్య కేసును ఛేదించిన పోలీసులు

మెదక్: జిల్లాలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 8న గ్రామ శివారులో మనోహరబాద్ మండలం పోతారానికి చెందిన రమేష్ (45) హత్యకు గురయ్యాడు. మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో అదే గ్రామానికి చెందిన నాగేందర్ హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. దీంతో నాగేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2021-09-18T00:41:23+05:30 IST