ఆ వాహనాల ధరలు పెరగనున్నాయ్...
ABN , First Publish Date - 2021-07-29T00:49:01+05:30 IST
వచ్చే వారం నుంచి ప్రయాణికుల వాహనాల ధరలను మళ్లీ పెంచాలని టాటా మోటార్స్ నిర్ణయించింది.
ముంబై : వచ్చే వారం నుంచి ప్రయాణికుల వాహనాల ధరలను మళ్లీ పెంచాలని టాటా మోటార్స్ నిర్ణయించింది. మెటీరియల్ సేకరణ వ్యయం భారీగా పెరగడంతో టాటా మోటార్స్ ఈ నిర్ణయానికి వచ్చింది. ముంబై కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థ... టియాగో, నెక్సాన్, హారియర్, సఫారి తదితర ప్యాసింజర్ వాహనాలను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది.
‘కంపెనీ రియలైజేషన్ పరంగా చూస్తే కేవలం 2.5 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించాము. ఎక్స్-షోరూమ్ కోణం నుంచి ఇది 3 శాతముంటుంది. ఈ నేపధ్యంలో... ఇన్పుట్ ఖర్చులలో భారీ వ్యత్యాసముండడంతో మేం మార్కెట్లోకి వెళ్ళగలిగాం’ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర పీటీఐకి చెప్పారు. వినియోగదారులపై ధరల భారాన్ని మోపవద్దని భావించడంతో వివిధ వ్యయ తగ్గింపు కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా పెరుగుతున్న ఇన్పుట్ వ్యయాల ప్రభావాన్ని కంపెనీ తగ్గించగలిగింది.
కానీ అంతరం ఇంకా మిగిలి ఉండటంతో పాటు అవసరమైన వస్తువుల ధరలు ఇంకా ఎక్కువగా ఉండటంతో వచ్చే వారం నుంచి ధరలను పెంచాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.