పోడు భూముల సమస్యను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-06-14T04:56:39+05:30 IST
మండలంలో పోడు భూములు సాగు చేస్తున్న రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆదివారం ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్వర్యంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిని నిర్మల్లోని ఆయన గృహంలో కలిసి వినతి పత్రం అందించామని ఎంపీపీ జైవంత్ తెలిపారు.
ఉట్నూర్, జూన్ 13: మండలంలో పోడు భూములు సాగు చేస్తున్న రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆదివారం ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్వర్యంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిని నిర్మల్లోని ఆయన గృహంలో కలిసి వినతి పత్రం అందించామని ఎంపీపీ జైవంత్ తెలిపారు. దంతెనపల్లిలో నిర్మాణం పూర్తయిన సబ్స్టేషన్, రైతు వేదిక భవనాల ప్రారంభానికి రావాలని కోరామన్నారు. పోడు భూముల సాగు చేస్తున్న రైతులకు పహానీలు ఇవ్వడంతో పాటు అటవీ పత్రాలతో చెక్డ్యాం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని వినతి ప్రతం అందించామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.