ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ABN , First Publish Date - 2022-04-23T04:13:45+05:30 IST
అర్హులైన పేదలకు డబు ల్ బెడ్రూమ్ ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, ధర ణిలో పేరుకున్న భూసమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేపట్టారు
దామరగిద్ద, ఏప్రిల్ 22: అర్హులైన పేదలకు డబు ల్ బెడ్రూమ్ ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, ధర ణిలో పేరుకున్న భూసమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, వెంకట్రాంరెడిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇ చ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వర కు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అనంత రం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహ సీల్దార్ వెంకటేష్కు అందించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు అంజిలయ్యగౌడ్, జ్యోషి, శివకుమార్, ముస్తాపేట్ సర్పంచ్ లాలప్ప, ప్రకాష్, భాస్కర్రెడ్డి, హన్మంతు, రామకృష్ణ, మొగులప్ప, అ శోక్, కనకప్ప, సంజీవ తదితరులు పాల్గొన్నారు.