పట్టాలు ఇచ్చారు..భూములు మరిచారు
ABN , First Publish Date - 2020-06-04T10:27:18+05:30 IST
నాలుగు నెలల క్రితం పట్టాలిచ్చినా ఇంతవరకు భూము లు చూపించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోటగిరి తహసీల్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
కోటగిరి, జూన్ 3 : నాలుగు నెలల క్రితం పట్టాలిచ్చినా ఇంతవరకు భూము లు చూపించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటగిరి మండలం సు ద్దులం తండా గ్రామానికి చెందిన పలువురు రైతులు బుధవారం తహసీల్ కా ర్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నాలుగు నెలల క్రితం 62 మందికి ప ట్టాలు ఇచ్చారని తెలిపారు. రెవెన్యూ, అటవీశాఖల మధ్యగల భూమిని సర్వే చే సి తమకు పంపిణీ చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు తక్షణమే భూములు చూయించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ విఠల్ కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నీల్సింగ్, రాజు, మహిళ రైతులు తదితరులున్నారు.