ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కాయకల్ప బృందం

ABN , First Publish Date - 2020-02-28T11:03:06+05:30 IST

దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్రస్థాయి నుంచి వచ్చిన కాయకల్ప బృందం అధికారులు

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కాయకల్ప బృందం

దోమకొండ, ఫిబ్రవరి 27: దోమకొండ  మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని  రాష్ట్రస్థాయి నుంచి వచ్చిన కాయకల్ప బృందం అధికారులు గురువారం పరిశీలిం చారు. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ఆపరేషన్‌ థియేటర్‌, మహిళ, పురుషుల వార్డులను, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక జడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్‌ ఆసుపత్రిలో వైద్యులు, రోగులకు సంబంధించిన వసతులపై బృం దం సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌, వైద్యులు సంగీత్‌ కుమార్‌, నాయకులు సీతరాం మధు, కాయకల్ప బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-28T11:03:06+05:30 IST