త్రుటిలో తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2020-05-16T10:32:40+05:30 IST

వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకుపోయింది.

త్రుటిలో తప్పిన ప్రమాదం

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు


మార్కాపురం, మే 15 : వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకుపోయింది. ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. రూరల్‌ ఎస్సై కోటయ్య కథనం ప్రకారం.. దేవరాజుగట్టు వైపు నుంచి మార్కాపురం వైపు వస్తున్న కారు ఇందిరా ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం ఆ పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకుపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా దుకాణం యజమానులు, కూలీలు ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విద్యుత్‌స్తంభం విరిగిపోవడంతో తీగలు వేలాడుతున్నాయి. కారులో ఉన్న వారికి కూడా ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. 

Updated Date - 2020-05-16T10:32:40+05:30 IST