రహదారులు నిర్మానుష్యం
ABN , First Publish Date - 2021-05-18T05:05:10+05:30 IST
క వైపు మండే ఎండలు.. మరో వైపు మధ్యాహ్నం 12 తరువాత కర్ఫ్యూ వుండడంతో పారిశ్రామిక ప్రాంతంలోని జాతీయ రహదారితోపాటు కాలనీల్లోని ప్రధాన రహదారులు సోమవారం నిర్మానుష్యంగా మారాయి
అక్కిరెడ్డిపాలెం, మే 17: ఒక వైపు మండే ఎండలు.. మరో వైపు మధ్యాహ్నం 12 తరువాత కర్ఫ్యూ వుండడంతో పారిశ్రామిక ప్రాంతంలోని జాతీయ రహదారితోపాటు కాలనీల్లోని ప్రధాన రహదారులు సోమవారం నిర్మానుష్యంగా మారాయి. కొద్దిపాటి భారీ వాహనాలు తప్పా జాతీయ రహదారిపై ఎటువంటి వాహనాలు రాకపోకలు సాగించకపోవడంతో పారిశ్రామిక ప్రాంతంలో బీహెచ్పీవీ, నాతయ్యపాలెం, షీలానగర్ జంక్షన్లలో జనసంచారం కనిపించలేదు.