మొరాయించిన ఆర్టీసీ బస్సు
ABN , First Publish Date - 2021-06-25T05:26:09+05:30 IST
చాగలమర్రి గ్రామంలోని మల్లేవేముల బస్టాండులో ఆళ్లగడ్డ డిపోకు చెందిన బస్సు గురువారం మొరాయించింది.
చాగలమర్రి, జూన్ 24: చాగలమర్రి గ్రామంలోని మల్లేవేముల బస్టాండులో ఆళ్లగడ్డ డిపోకు చెందిన బస్సు గురువారం మొరాయించింది. బస్సు కండిషన్ సరిగా లేకపోవడంతో నిలిచి పోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చివరకు ప్రయాణికులు తోయడంతో బస్సు ముందుకు కదిలింది.