తెలంగాణ సాయుధ పోరాటంలో బండ్రు నర్సింహులు పాత్ర కీలకం
ABN , First Publish Date - 2022-01-24T05:49:58+05:30 IST
తెలంగాణ సాయుధ పోరాటంలో బండ్రు నర్సింహులు కీలకపాత్ర పోషించారని సీపీఐ ఎంఎల్, న్యూడెమోక్రసీ, సీపీఐ నాయకులు అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, సీపీఐ ఎంఎల్ జనశక్తి రాష్ట్ర నాయకుడు బండ్రు నర్సిం హులు సంతాపసభలను ఆ పార్టీల నాయకులు ఆదివారం ఆలేరులో వేర్వేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహులు
ఆలేరు, జనవరి 23: తెలంగాణ సాయుధ పోరాటంలో బండ్రు నర్సింహులు కీలకపాత్ర పోషించారని సీపీఐ ఎంఎల్, న్యూడెమోక్రసీ, సీపీఐ నాయకులు అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, సీపీఐ ఎంఎల్ జనశక్తి రాష్ట్ర నాయకుడు బండ్రు నర్సిం హులు సంతాపసభలను ఆ పార్టీల నాయకులు ఆదివారం ఆలేరులో వేర్వేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహులు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగా డ సంతాపం తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు ఆర్ జనార్థన్, బేజాడి కుమార్, సుజాత, రాజు, కె. సత్యనారాయణ, మామిడాల భిక్షపతి, కల్లెపు అడవయ్య, ఇక్కిరి సహదేవ్, భిక్షపతి, శ్రీశైలం, మురళి, చింతకింది సిద్దులు, సత్యనారాయణ, బాల మల్లేశ్, ఎలగందుల సిద్దు లు, రామదాసు చెక్క వెంకటేశ్, శ్రీనివాస్, కనకయ్య, ఎం చంద్రశే ఖర్, రమేశ్, దూపటి వెంకటేశ్, ఎంఏ ఎక్బాల్, అశోక్, మహేశ్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.