సచివాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలి
ABN , First Publish Date - 2021-12-02T06:00:52+05:30 IST
సచివాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని జడ్పీ సీఈవో ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు.
ఏర్పేడు, డిసెంబరు 1: సచివాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని జడ్పీ సీఈవో ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పాపానాయుడుపేట గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పథకాల బోర్డులను పరిశీలించారు. ప్రభుత్వ కార్యక్రమాల పురోగతి రికార్డులు అప్డేట్గా ఉంచుకోవాలన్నారు. అక్కడి నుంచి పక్కనే ఉన్న గ్రామీణ పశువైద్యశాలను సందర్శించారు. రికార్డులు, పశువుల దాణా, మందుల నిల్వలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీపీవో దశరథరామిరెడ్డి, డీఎల్డీవో ఆదిశేషారెడ్డి, ఎంపీడీవో విష్ణుచిరంజీవి, డీపీఆర్సీ రిసోర్స్పర్సన్ షణ్ముగం, సర్పంచ్ లలిత తదితరులు పాల్గొన్నారు.