టీటీడీ ఆస్తుల విక్రయం వెంటనే ఆపాలి

ABN , First Publish Date - 2020-05-26T05:30:00+05:30 IST

ప్రభుత్వం టీటీడీ ఆస్తులను వెంటనే ఆపాలని కోరుతూ రాజంపేటలో హిందూ ధర్మసంరక్షకులు ఆందోళన

టీటీడీ ఆస్తుల విక్రయం వెంటనే ఆపాలి

రాజంపేట టౌన్‌, మే 25 : ప్రభుత్వం టీటీడీ ఆస్తులను వెంటనే ఆపాలని  కోరుతూ రాజంపేటలో హిందూ ధర్మసంరక్షకులు ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ ధర్మసంరక్షకులు మోదుగుల పెంచలయ్య, శ్రీనివాసులనాయుడు, సింగంశెట్టి కృష్ణకుమార్‌   కలిసి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద సేవ్‌ తిరుమల పేరుతో భక్తులు విరాళాలుగా ఇచ్చిన ఆస్తులను అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని, టీడీపీఆస్తులకు ప్రభుత్వం కాపాలాదారు మాత్రమేనన్నారు. అనంతరంఆర్డీవో ధర్మచంద్రారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. 


రైల్వేకోడూరు: టీటీడీకి చెందిన భూముల అమ్మకాలు చేపట్టడం సరి కాదని జనసేన నాయకులు అంకిపల్లె అఖిల్‌, మర్రిరెడ్డి ప్రసాద్‌, ఉల్లి వెంకటసాయి, సింగిరి విశ్వనాధ్‌, దళిత నాయకుడు మహేష్‌, దశరధ తెలిపారు. టీటీడీ భూముల అమ్మకాలపై సోమవారం స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిరసన వ్యక్తం చేశారు. అమ్మకాలు చేస్తే ఆందోళనలు తీవ్ర స్థాయిలో చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2020-05-26T05:30:00+05:30 IST