విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్రం మరో ముందడుగు
ABN , First Publish Date - 2021-07-08T03:47:07+05:30 IST
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్రం మరో ముందడుగు వేసింది. కన్సల్టెంట్ నియామకానికి
విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్రం మరో ముందడుగు వేసింది. కన్సల్టెంట్ నియామకానికి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు అనుబంధ సంస్థలన్నీ వందశాతం అమ్ముతామని ప్రకటనలో కేంద్రం పేర్కొంది. ఏపీలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్ ప్లాంట్ మైన్స్ను కూడా అమ్మకానికి కేంద్రం పెట్టింది. బిడ్లో పాల్గొనేందుకు లక్ష రూపాయల డిపాజిట్, కోటి రూపాయల బ్యాంక్ గ్యారంటీ చూపాలని నోటిఫికేషన్లో కేంద్రం పేర్కొంది.