ఇసుకను దోచేస్తున్నారు

ABN , First Publish Date - 2020-06-04T10:21:27+05:30 IST

‘‘సాక్షాత్తు.. ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లా, ఆయన మేనమామ నియోజకవర్గమైన కమలాపురంలో ఇసుకను

ఇసుకను దోచేస్తున్నారు

సీఎం గారూ.. మీ మామ నియోజకవర్గంలోనే అక్రమాలు

మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి


కడప, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ‘‘సాక్షాత్తు.. ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లా, ఆయన మేనమామ నియోజకవర్గమైన కమలాపురంలో ఇసుకను దోచేస్తున్నారు. అనుమతుల మాటున మూడు రెట్లు అక్రమంగా తోడేస్తున్నారు. రోజూ వందలాది లారీలు, టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి గారూ.. మీ మామ నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దోపిడీపై చర్యలు తీసుకుని శభాష్‌ అనిపించుకోండి’’ అంటూ మాజీ ఎమ్మెల్సీ, కమలాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పుత్తా నరసింహారెడ్డి సూచించారు. బుధవారం కడపలోని హోటల్‌ హరిప్రియలో ఆయన విలేకరులతో మాట్లాడారు.


జిల్లాలో ఎక్కడా లేని విధంగా కమలాపురం నియోజకవర్గంలో ఇసక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రైతులకు సంబంధించిన డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతించిన అధికారులు అక్కడ నిర్దేశిత ప్రమాణాల మేరకు తవ్వకాలు జరుగుతున్నాయో లేదో పరిశీలించడం లేదన్నారు. పెండ్లిమర్రి మండలంలోని కొండూరులో 11 మంది షెడ్యూల్డు కులాలకు చెందిన వారి పది ఎకరాల్లో ఇసుక తవ్వకాలకు అనుమతించి మైనింగ్‌ మాత్రం అధికార పార్టీ నాయకులు చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమాలపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో అదనపు ఎస్పీ చక్రవర్తికి ఫిర్యాదు చేశామన్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌, వై.రాంప్రసాద్‌, మాసా కోదండరామ్‌, శ్రీనివాసులరెడ్డి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-04T10:21:27+05:30 IST