అనూహ్య లాభాలు..

ABN , First Publish Date - 2020-03-26T08:21:02+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల బాటలో సాగాయి. బుధవారం నాడు మార్కెట్లు అనూహ్యంగా అత్యుత్తమ లాభాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు దూకుడుగా

అనూహ్య లాభాలు..

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల బాటలో సాగాయి. బుధవారం నాడు మార్కెట్లు  అనూహ్యంగా అత్యుత్తమ లాభాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు దూకుడుగా సాగటం, అమెరికా 2 ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం తెలపటంతో పాటు దేశీయంగా కరోనా సంక్షోభాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించవచ్చన్న ఆశలతో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ ఏకంగా 1,861.75 పాయుంట్ల (6.98 శాతం) లాభంతో 28,535.78 పాయింట్ల వద్ద ముగియగా ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 516.80 పాయింట్లు (6.62 శాతం) లాభపడి 8,317.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. దశాబ్ద కాలం తర్వాత మార్కె ట్లు  ఒక్కరోజున ఇంత భారీ స్థాయిలో లాభాలను నమోదు చేసుకోవటం ఇదే మొదటిసారి కావటం విశేషం. 

Updated Date - 2020-03-26T08:21:02+05:30 IST