పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2020-10-16T06:03:51+05:30 IST

నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని, కార్మికులు అంకితభావంతో విధులు

పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం

నగర మేయర్‌ వై.సునీల్‌రావు 


కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 15: నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని, కార్మికులు అంకితభావంతో విధులు నిర్వహించడంతోనే కోవిడ్‌-19తో పాటు సీజనల్‌ వ్యాధులకు అడ్డుకట్ట పడిందని నగర మేయర్‌ వై.సునీల్‌రావు అన్నారు. గురువారం 59వ డివిజన్‌ కార్పొరేటర్‌ గందె మాధవి మహేశ్‌ ఆధ్వర్యంలో డివిజన్‌లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన దుస్తుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నగరపాలక సంస్థ సభ్యులందరూ  పారిశుధ్య కార్మికులకు కొత్త బట్టలు అందజేయడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు.


నగరంలో దాదాపు వేయి మంది కార్మికులు 60 డివిజన్లలో సేవలందిస్తున్నారని చెప్పారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణలో కరీంనగర్‌ కార్పొరేషన్‌ ముందంజలో ఉందని అన్నారు. కార్మికులకు నాలుగుసార్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మం దులను ఉచితంగా అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ వాల రమణారావుతో పాటు మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-16T06:03:51+05:30 IST