వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి
ABN , First Publish Date - 2021-01-27T06:17:06+05:30 IST
కొవిడ్ 19 నేపథ్యంలో ప్రజలకు వైద్య సిబ్బం ది ముందుండి సేవలందించిన విషయం మరువలేనిదని జిల్లా వైద్యాధికారి ప్ర మోద్కుమార్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు బోంకూరి శంకర్లు అన్నారు.
పెద్దపల్లి రూరల్, జనవరి 26: కొవిడ్ 19 నేపథ్యంలో ప్రజలకు వైద్య సిబ్బం ది ముందుండి సేవలందించిన విషయం మరువలేనిదని జిల్లా వైద్యాధికారి ప్ర మోద్కుమార్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు బోంకూరి శంకర్లు అన్నారు. మంగళ వారం పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మె డికల్, హెల్త్ ఫోరం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. దీంతో పాటు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజనరేందర్, జిల్లా ప్రధాన ఆసుపత్రుల సూపరింటెం డెంట్ వాసుదేవారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రధానఆసుపత్రిలో ల్యాబ్ టెక్నిషియన్గా విధు లు నిర్వహిస్తున్న ఉద్యోగికి అవార్డు రాకపోవడంపై వైద్యులు శ్రీరాంతో మం డల పరిషత్ కార్యాలయం ఎదుట వాగ్వాదానికి దిగారు. దీంతో సహుద్యోగులు వారి ద్దరిని సముదాయించారు.