ప్రభుత్వాల తీరుతో రైతు పరిస్థితి దయనీయం

ABN , First Publish Date - 2021-12-02T08:59:23+05:30 IST

దేశానికి అన్నం పెట్టే రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ఆకలి కేకలు పెట్టే దుస్థితికి చేరుకున్నారని బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వాల తీరుతో రైతు పరిస్థితి దయనీయం

  • రూ.100 సంపాదించడం సులభం కాదు: ఆర్‌.ఎస్‌.
  • రెండు ధాన్యం బస్తాలు మోసిన బీఎస్పీ కో-ఆర్డినేటర్‌

నార్కట్‌పల్లి, డిసెంబరు 1: దేశానికి అన్నం పెట్టే రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ఆకలి కేకలు పెట్టే దుస్థితికి చేరుకున్నారని బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగిలో వరి వేయొద్దంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేయాలో చెప్పడం లేదని విమర్శించారు. ప్రత్యామ్నాయ పంటలు, మద్దతు ధర వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించి, భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. బస్తాలను లారీపైకి ఎక్కిస్తున్న హమాలీల వద్దకెళ్లి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. రెండు ధాన్యం బస్తాలు మోసి రూ.100 కూలి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రూ.100 సంపాదించడం అంత సులభం కాదన్నారు.

Updated Date - 2021-12-02T08:59:23+05:30 IST