రైతుబంధు డబ్బు ఇవ్వలేదని తల్లిని చంపిన తనయుడు

ABN , First Publish Date - 2021-03-03T08:44:14+05:30 IST

రైతు బంధు డబ్బుల కోసం కన్నతల్లి ప్రాణాలు తీసిన కర్కోటకుడి ఉదంతమిది. మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం నంచర్లలో జరిగినఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

రైతుబంధు డబ్బు ఇవ్వలేదని తల్లిని చంపిన తనయుడు

గండీడ్‌, మార్చి 2: రైతు బంధు డబ్బుల కోసం కన్నతల్లి ప్రాణాలు తీసిన కర్కోటకుడి ఉదంతమిది. మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం నంచర్లలో జరిగినఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నంచరకు చెందిన రైతు నర్సమ్మ (65)కు ఇద్దరు కుమారులు తిర్మలయ్య, మల్లయ్యతో పాటు ఆరుగు రు కూతుళ్లు ఉన్నారు. ఆమెకు ఐదెకరాల వ్యవసా య భూమి ఉండగా, అందులో కొంత భాగాన్ని ఆమె సాగుచేసుకుంటుండగా, మిగతా భాగాన్ని ఇద్దరు కు మారులు సాగు చేసుకుంటున్నారు. కాగా, సోమవా రం చిన్నకుమారుడు మల్లయ్య పొలం దగ్గరకు వెళ్లి తన తల్లి సాగుచేస్తున్న ఉల్లి తోటను గేదెలతో తొ క్కించి ధ్వంసం చేశాడు. అది చూసిన తల్లి.. దూషించడంతో ఆగ్రహించిన మల్లయ్య భూమిని తన పేర భూమిని రిజిస్ట్రేషన్‌ చేయకపోగా రైతుబంధు డబ్బు కూడా ఇవ్వవా అంటూ తల్లిపై దాడిచేసి, గొంతునులిమి హత్య చేశాడు. పోలీసులు మల్లయ్యను అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-03T08:44:14+05:30 IST