ఏపీకి నిధులొచ్చాయ్..
ABN , First Publish Date - 2020-04-04T13:07:44+05:30 IST
ఏపీకి నిధులొచ్చాయ్..
న్యూఢిల్లీ(ఆంధ్రజ్యోతి): కేంద్రం నుంచి రెండు పద్దుల్లో ఆంధ్రప్రదేశ్కు రూ.1050.64 కోట్లు నిధులు రానున్నాయి. ఇందులో జాతీయ విపత్తుల నిర్వహణ (ఎస్డీఆర్ఎంఎఫ్) కోసం 2020-21 సంవత్సరానికి తొలి విడత కింద రూ.559.50 కోట్లు విడుదల కానున్నాయి. దీనికి కేంద్ర హోం శాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. అలాగే 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక లోటు భర్తీ చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ 2020-21 సంవత్సరానికి రూ.491.14 కోట్లు విడుదల చేసింది.