రాష్ట్ర అవతరణ వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తాం
ABN , First Publish Date - 2020-05-31T10:00:20+05:30 IST
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఈసారి నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా
కలెక్టరేట్లోనే పతాకావిష్కరణ
హాజరవనున్న మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి వెల్లడి
మెదక్ రూరల్, మే 30: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఈసారి నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి సభలు, సమావేశాలు లేకుండా నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు.
నివాళులర్పించడం, జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలకే పరిమితం కానున్నట్లు వివరించారు. వేడుకలకు మెదక్ జిల్లాకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసారి శ్రీనివా్సయాదవ్ హాజరవుతారని తెలిపారు. జూన్ 2వ తేదీన కలెక్టరేట్లో జాతీయ పతాకావిష్కరణ ఉంటుందని, అంతకుముందు చిన్నశంకరంపేట మండలంలోని అమరువీరుల స్థూపం వద్ద నివాళులర్పించి మెదక్కు చేరుకుంటారని అన్నారు.