7న జరిగే సమ్మెను జయప్రదం చేయాలి
ABN , First Publish Date - 2022-01-28T06:17:27+05:30 IST
పీఆర్సీపై ఫిబ్రవరి 7న తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని మండల పీఆర్సీ పోరాట సాధన సమితి తీర్మానించింది.
పీఆర్సీ పోరాట సాధన సమితి తీర్మానం
ఇబ్రహీంపట్నం, జనవరి 27: పీఆర్సీపై ఫిబ్రవరి 7న తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని మండల పీఆర్సీ పోరాట సాధన సమితి తీర్మానించింది. మండల విద్యాశాఖ భవన సముదాయంలో సమితి ఆధ్వర్యంలో గురువారం వివిధ ఉపాధ్యాయ, రెవెన్యూ సంఘాల సమావేశం చేసిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్, యూటీఎఫ్, డీపీఆర్టీయూ, పీఆర్టీయూ, రెవెన్యూ అసోసియేషన్ నాయకులు సయ్యద్ ఖాసీం, రెడ్స్టార్, ఆదిలక్ష్మి, నాగబాబు, సుగుణరావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, రఘు, రమే్షబాబు, ఇర్పాన్ బాష, బోసుబాబు పాల్గొన్నారు.