సమ్మె ప్రతిపాదన విరమించుకోవాలి

ABN , First Publish Date - 2022-01-29T06:01:07+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు సమ్మె ప్రతిపాదన విరమించుకోవాలని సీఎండీ అతుల్‌భట్‌ కోరారు. ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులతో ఆయన శుక్రవారం ప్లాంట్‌లో సమావేశమయ్యారు.

సమ్మె ప్రతిపాదన విరమించుకోవాలి
కార్మిక సంఘాల నాయకులతో సమావేశమైన సీఎండీ అతుల్‌భట్‌

స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌

ఉక్కుటౌన్‌షిప్‌, జనవరి 28: స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు సమ్మె ప్రతిపాదన విరమించుకోవాలని సీఎండీ అతుల్‌భట్‌ కోరారు. ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులతో ఆయన శుక్రవారం ప్లాంట్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ కంపెనీకి అనేక ఇబ్బందులు ఉన్నాయని, కోకింగ్‌ కోల్‌ ధర పెరిగిపోయిందని పేర్కొన్నారు. ప్లాంట్‌ ఇబ్బందులను ఎదుర్కొని లాభాల బాటలో పయనిస్తున్నదని, ఈ క్రమంలో కార్మికులు ఈ నెల 31న సమ్మె చేపట్టడం తగదన్నారు. వచ్చే నెల 3న బోర్డు మీటింగ్‌ సమావేశంలో ఉద్యోగుల వేతనాలపై చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు జె.అయోధ్యరామ్‌, మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, వెటీ దాసు, గంధం వెంకటరావు, నీరుకొండ రామచంద్రరావు, జి.గణపతిరెడ్డి, బొడ్డు పైడిరాజు, వై.మస్తానప్ప, పాడి త్రినాథరావు, గుమ్మడి నరేంద్రకుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-29T06:01:07+05:30 IST