సమ్మె ప్రతిపాదన విరమించుకోవాలి
ABN , First Publish Date - 2022-01-29T06:01:07+05:30 IST
స్టీల్ప్లాంట్ కార్మికులు సమ్మె ప్రతిపాదన విరమించుకోవాలని సీఎండీ అతుల్భట్ కోరారు. ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులతో ఆయన శుక్రవారం ప్లాంట్లో సమావేశమయ్యారు.
స్టీల్ప్లాంట్ సీఎండీ అతుల్భట్
ఉక్కుటౌన్షిప్, జనవరి 28: స్టీల్ప్లాంట్ కార్మికులు సమ్మె ప్రతిపాదన విరమించుకోవాలని సీఎండీ అతుల్భట్ కోరారు. ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులతో ఆయన శుక్రవారం ప్లాంట్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ కంపెనీకి అనేక ఇబ్బందులు ఉన్నాయని, కోకింగ్ కోల్ ధర పెరిగిపోయిందని పేర్కొన్నారు. ప్లాంట్ ఇబ్బందులను ఎదుర్కొని లాభాల బాటలో పయనిస్తున్నదని, ఈ క్రమంలో కార్మికులు ఈ నెల 31న సమ్మె చేపట్టడం తగదన్నారు. వచ్చే నెల 3న బోర్డు మీటింగ్ సమావేశంలో ఉద్యోగుల వేతనాలపై చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు జె.అయోధ్యరామ్, మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ, వెటీ దాసు, గంధం వెంకటరావు, నీరుకొండ రామచంద్రరావు, జి.గణపతిరెడ్డి, బొడ్డు పైడిరాజు, వై.మస్తానప్ప, పాడి త్రినాథరావు, గుమ్మడి నరేంద్రకుమార్ పాల్గొన్నారు.