షుగర్‌ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి

ABN , First Publish Date - 2021-10-25T05:24:48+05:30 IST

ప్రభుత్వం వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెబుతోందని, ప్రభుత్వమే రైతులకు ప్రత్యామ్నాయం ఏవి వేసుకోవాలో చూపాలని, నిజాంషుగర్స్‌ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బోధన్‌లో పలువురు యువకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం టీఆర్‌ఎస్‌

షుగర్‌ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి
కాంగ్రెస్‌లో చేరిన వారితో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి

బోధన్‌ రూరల్‌, అక్టోబరు 24: ప్రభుత్వం వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెబుతోందని, ప్రభుత్వమే రైతులకు ప్రత్యామ్నాయం ఏవి వేసుకోవాలో చూపాలని, నిజాంషుగర్స్‌ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బోధన్‌లో పలువురు యువకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫ్యాక్టరీని తెరిపించాలని, ప్రత్యామ్నాయ పంటలుగా రైతులు వరిని సాగు చేసుకుంటారని, దీంతో రైతులందరికీ లాభాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. అనంతరం బోధన్‌ పట్టణ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. పట్టణ అధ్యక్షుడిగా పాషామొయినోద్దీన్‌ను ఎన్నుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన వెంట అబ్బగోని గంగాధర్‌ గౌడ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గౌసోద్దీన్‌, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌ గౌడ్‌, కౌన్సిలర్‌ దాము,  తదితరులు ఉన్నారు. 

రెంజల్‌(నవీపేట): ఇటీవల భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం మండలంలోని నీలాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.  ఈ సందర్భంగా పలువురు యువకులు మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  

Updated Date - 2021-10-25T05:24:48+05:30 IST