మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి
ABN , First Publish Date - 2021-03-05T05:36:22+05:30 IST
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలను రద్దు చేయడంతో పాటు వారు పండించిన ప్రతీ పంటకు చెల్లించే మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని మహిళా సాధికార మంచ్ జాతీయ నాయకురాలు ఆశలత అన్నారు.
ఆదిలాబాద్టౌన్, మార్చి 4: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలను రద్దు చేయడంతో పాటు వారు పండించిన ప్రతీ పంటకు చెల్లించే మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని మహిళా సాధికార మంచ్ జాతీయ నాయకురాలు ఆశలత అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సభకు ఆశలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ఆహార భద్రత కోసం, రైతుల పంటలకు న్యాయమైన ధరల కోసం ఈ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇందులో రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న, రాష్ట్ర కన్వీనర్ కొండల్రెడ్డి, శంకర్, ప్రభాకర్రెడ్డి, బండిదత్తాత్రి, లోకారిపోశెట్టి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.