మునిసిపాలిటీ ప్రజలపై పన్నుల భారం తగదు

ABN , First Publish Date - 2021-06-18T05:20:33+05:30 IST

మునిసిపాలిటీ ప్రజలపై పన్నుల భారాన్ని నిర సిస్తూ నర్సీపట్నం పన్ను చెల్లింపుదారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ముని సిపిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు.

మునిసిపాలిటీ ప్రజలపై పన్నుల భారం తగదు
మునిసిపల్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న ట్యాక్స్‌ పేయర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు

 నర్సీపట్నం, జూన్‌ 17 : మునిసిపాలిటీ ప్రజలపై పన్నుల భారాన్ని నిర సిస్తూ నర్సీపట్నం పన్ను చెల్లింపుదారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ముని సిపిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. సంఘం అధ్యక్షుడు త్రిమూర్తులురెడ్డి మాట్లాడుతూ మార్కెట్‌ విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమ యంలో ఇటువంటి భారాలు సరికావ న్నారు. చెత్తపై యూజర్‌ చార్జీలు, మార్కెట్‌ విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కార్యదర్శి శివనారాయణరాజు కోరారు. అనంతరం కమిషనర్‌ కనకరావుకు వినతి పత్రం అందజేశారు. సంఘం ప్రతినిధులు కన్నయ్యశెట్టి, జోగినాయుడు, సీఐటీయూ నాయకులు డి.సత్తిబాబు, రాజు, ఈశ్వరరావు తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T05:20:33+05:30 IST