తీన్ సుఖియా రైలుకు జిల్లాలో హాల్ట్ ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-02-25T04:49:17+05:30 IST
జిల్లా నుంచి ఈశాన్య రాషా్ట్రలైన అసోం, అరుణాచల్ ప్రదేశ్లకు వలస కూలీలు రాకపోకలు సాగిస్తుంటారని, అందువల్ల తీన్సుఖియా రైలుకు జిల్లాలో హాల్ట్ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
కోటబొమ్మాళి: జిల్లా నుంచి ఈశాన్య రాషా్ట్రలైన అసోం, అరుణాచల్ ప్రదేశ్లకు వలస కూలీలు రాకపోకలు సాగిస్తుంటారని, అందువల్ల తీన్సుఖియా రైలుకు జిల్లాలో హాల్ట్ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. వారంతా పండుగలు, వివిధ పనుల కోసం మన జిల్లాకు వచ్చి నప్పు డు ఈ ట్రైన్కు హాల్డ్ లేకపోవడంతో విశాఖపట్నం వెళ్లి అక్కడి నుంచి రాకపోకలు సాగించాల్సి వస్తున్నందున ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. జిల్లాలో ఏ స్టేషన్లోనైనా హాల్ట్ ఇస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, ఆ దిశగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రైల్వే అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.