భవనం పైనుంచి పడి దొంగ మృతి
ABN , First Publish Date - 2021-04-12T20:28:56+05:30 IST
ఓ ఇంట్లో చోరీ చేయడానికి వెళ్లిన దొంగ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి మరణించిన
హైదరాబాద్: ఓ ఇంట్లో చోరీ చేయడానికి వెళ్లిన దొంగ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి మరణించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలోని వెంకటగిరిలో గల ఒక ఇంట్లో చోరీ చేయడానికి సదరు దొంగ వెళ్లాడు. అయితే భవనం పైనుంచి మరో భవనం పైకి దూకే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఆ దొంగ పైనుంచి కిందపడి జారి పడ్డాడు. దీంతో ఆ దొంగ అక్కడికక్కడే మరణించాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై విచారణ మొదలు పెట్టారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి సహజంగా మరణించాడా లేక ప్రమాదవశాత్తు మరణించాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.