పోతురాజు విగ్రహాన్ని తవ్వేసిన దుండగులు

ABN , First Publish Date - 2020-09-24T10:45:16+05:30 IST

గుప్త నిధుల కోసం పోతురాజు విగ్రహాన్ని తోవ్వేసి గుంత తీసిన ఘటన మండల కేంద్రమైన పెద్దారవీడులో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం

పోతురాజు విగ్రహాన్ని తవ్వేసిన దుండగులు

పెద్దారవీడు, సెప్టెంబరు 23: గుప్త నిధుల కోసం పోతురాజు విగ్రహాన్ని తోవ్వేసి గుంత తీసిన ఘటన మండల కేంద్రమైన పెద్దారవీడులో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చాలా సంవత్సరాలుగా  అరిటిమ్మబావి వద్ద ఉన్న పోతురాజు విగ్రహాన్ని రాత్రికి రాత్రే నలుగురు దుండగులు గుప్తనిధుల కోసం తోవ్వి పక్కకు పడేశారు. విగ్రహాన్ని రోడ్డు పక్కనే పడేయడంతో అటుగా వెళ్తున్న గ్రామ ప్రజలు ఆందోళన చెందారు.  దుండగులను కఠినంగా శిక్షించాలని గ్రామ ప్రజలు కోరారు.

Updated Date - 2020-09-24T10:45:16+05:30 IST