‘టాటా ఏసీ’ని దహనం చేసిన దుండగులు
ABN , First Publish Date - 2021-01-16T05:59:55+05:30 IST
గుర్తు తెలియని వ్యక్తులు టాటా ఏసీ వాహనాన్ని దహనం చేసిన సంఘటన దౌలాపూర్ గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
పాపన్నపేట, జనవరి 15: గుర్తు తెలియని వ్యక్తులు టాటా ఏసీ వాహనాన్ని దహనం చేసిన సంఘటన దౌలాపూర్ గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దౌలాపూర్ గ్రామానికి చెందిన వడ్ల లింగం టాటా ఏసీని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం రాత్రి ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాన్ని దుండగులు దహనం చేశారు. తమ్ముడిపై అనుమానం వ్యక్తం చేస్తూ లింగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.