మంచిర్యాల జిల్లాలో పెద్దపులి కలకలం

ABN , First Publish Date - 2020-06-05T17:28:39+05:30 IST

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి అలజడి రేపుతోంది.

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి కలకలం

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి అలజడి రేపుతోంది. దట్టమైన అడవి ప్రాంతాలను వదిలేసి జనావాస ప్రాంతాల్లో సంచరిస్తోంది. శ్రీరామ్ పూర్ ఏరియా సింగరేణి గనుల సమీపంలో పులి తిరుగుతోంది. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సమాచారం. తాజాగా శ్రీరామ్ పూర్ ప్రాంతం ఆర్కే-8 గని వద్ద పెద్దపులి సంచరించింది. గని సమీపంలోని అడవి నుంచి మెయిన్ గేటు సమీపంలో ఉన్న నీటిమడుగులో నీరు తాగడానికి వచ్చినట్లుగా తెలియవచ్చింది. దీంతో అక్కడున్నవారు పెద్దపులిని చూసి ఒక్కసారిగా భయాందోళనకుగురై పరుగులు తీశారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చేలోగా పులి అక్కడి నుంచి అటవీలోకి వెళ్లిపోయింది. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న అటవీ అధికారులు అడుగులు ఆధారంగా పులి సంచారాన్ని ధృవీకరించారు.

Updated Date - 2020-06-05T17:28:39+05:30 IST